రిలయన్స్ జియో ఆరంభంతోనే విప్లవాత్మక మార్పులకు తెరతీసింది మరియు టెలికాం రంగంలో ఓ సంచలనం. ముఖ్యంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలను అతి చౌకగా, ఇతర టెలికాం సంస్థలకు దీటుగా అందించింది. ఇప్పుడు మరో సంచలనానికి జియో తెరతీయనుందని వ్యాపార వర్గాల సమాచారం. హోమ్ బ్రాడ్బాండ్ సేవలను రిలయన్స్ జియో ప్రారంభించనుంది. ఈ ఏడాది దీపావళి నాటికి ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక రచిస్తోంది.
2017లో బ్రాండ్బాండ్ సేవలను ప్రారంభించే ఉద్దేశం ఉందని రిలయన్స్ గతంలోనే వెల్లడించింది. తన అధికారిక వెబ్సైట్లోనూ జియో బ్రాండ్బాండ్, డీటీహెచ్ సేవలను గురించి ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో మొబైల్ ఇంటర్నెట్ మాదిరిగానే హోమ్ బ్రాండ్బాండ్ సేవలను కూడా అతి చౌకగా వినియోగదారులకు అందించాలని రిలయన్స్ యోచిస్తోందట. అతితక్కువగా రూ.500లకు 100 జీబీ డేటాను జియో ఇవ్వనుందని సమాచారం. తాజాగా వెలువడుతున్న నివేదికల ప్రకారం వచ్చే నెలలో జియో ఫైబర్కు సంబంధించిన వివరాలను రిలయన్స్ వెల్లడించే అవకాశం ఉంది.
ముంబయి, దిల్లీ-ఎన్సీఆర్, అహ్మదాబాద్, జమ్నగర్, సూరత్, వడోదర వంటి ఎంపిక చేసిన నగరాల్లో హోమ్ బ్రాండ్బాండ్ సేవలను పరీక్షిస్తున్నట్లు ఈ నెలలో జియో ట్వీట్ చేసింది. పూర్తి స్థాయిలో పరీక్షించిన అనంతరం ఇతర ప్రాంతాలకూ ఈ సేవలను జియో విస్తరించనుంది. ప్రారంభ ఆఫర్ కింద ఏకంగా 100 ఎంబీపీఎస్ వేగంతో హోమ్ బ్రాడ్బాండ్ సేవలు ఉండనున్నాయి. అదీ కూడా చౌకగా వినియోగదారులకు అందించే అవకాశం ఉంది.
రిలయన్స్ జియోతో మొబైల్ సంస్థలు తీవ్ర ఒత్తిడికి గురైన సంగతి తెలిసిందే. ఇక హోమ్ బ్రాండ్బాండ్ సేవలను జియో తీసుకురానుండటంతో ఈ రంగంలో కూడా ఇతర పోటీ సంస్థలకు ఒత్తిడి తప్పదని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఇతర నెట్వర్క్లూ ధరలు తగ్గించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు
2017లో బ్రాండ్బాండ్ సేవలను ప్రారంభించే ఉద్దేశం ఉందని రిలయన్స్ గతంలోనే వెల్లడించింది. తన అధికారిక వెబ్సైట్లోనూ జియో బ్రాండ్బాండ్, డీటీహెచ్ సేవలను గురించి ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో మొబైల్ ఇంటర్నెట్ మాదిరిగానే హోమ్ బ్రాండ్బాండ్ సేవలను కూడా అతి చౌకగా వినియోగదారులకు అందించాలని రిలయన్స్ యోచిస్తోందట. అతితక్కువగా రూ.500లకు 100 జీబీ డేటాను జియో ఇవ్వనుందని సమాచారం. తాజాగా వెలువడుతున్న నివేదికల ప్రకారం వచ్చే నెలలో జియో ఫైబర్కు సంబంధించిన వివరాలను రిలయన్స్ వెల్లడించే అవకాశం ఉంది.
ముంబయి, దిల్లీ-ఎన్సీఆర్, అహ్మదాబాద్, జమ్నగర్, సూరత్, వడోదర వంటి ఎంపిక చేసిన నగరాల్లో హోమ్ బ్రాండ్బాండ్ సేవలను పరీక్షిస్తున్నట్లు ఈ నెలలో జియో ట్వీట్ చేసింది. పూర్తి స్థాయిలో పరీక్షించిన అనంతరం ఇతర ప్రాంతాలకూ ఈ సేవలను జియో విస్తరించనుంది. ప్రారంభ ఆఫర్ కింద ఏకంగా 100 ఎంబీపీఎస్ వేగంతో హోమ్ బ్రాడ్బాండ్ సేవలు ఉండనున్నాయి. అదీ కూడా చౌకగా వినియోగదారులకు అందించే అవకాశం ఉంది.
రిలయన్స్ జియోతో మొబైల్ సంస్థలు తీవ్ర ఒత్తిడికి గురైన సంగతి తెలిసిందే. ఇక హోమ్ బ్రాండ్బాండ్ సేవలను జియో తీసుకురానుండటంతో ఈ రంగంలో కూడా ఇతర పోటీ సంస్థలకు ఒత్తిడి తప్పదని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఇతర నెట్వర్క్లూ ధరలు తగ్గించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు