ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులకు ఇక నుంచి తెలుగులో e-మెయిల్ సేవలు అందుబాటులోకి అందించనున్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ఈమెయిల్ సర్వీసులను అందించేందుకు బీఎస్ఎన్ఎల్ జైపూర్ కేంద్రంగా పనిచేసే డాటామెయిల్తో ఒప్పందం చేసుకున్నది.
బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు ఎనిమిది భారతీయ భాషల్లో ఉచితంగా మెయిల్ ఐడీలను అందించనున్నది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బాండ్ యూజర్లు డాటామెయిల్ సర్వీస్ ద్వారా తమ సొంత భాషల్లో మెయిల్ ఓపెన్ చేసుకోవచ్చు.
ప్రాంతీయ భాషల్లో మెయిల్ అడ్రస్లు ఇవ్వడం డిజిటల్ ఇండియాలో భాగంగా వేసిన గొప్ప ముందడుగుగా బీఎస్ఎన్ఎల్ ఎండీ అనుపమ్ శ్రీవాత్సవ్ అభివర్ణించారు. భారతదేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు తమ సొంత భాషల్లో ఈమెయిల్ సందేశాలను పంపుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ సేవలు మొబైల్ అప్లికేషన్ ద్వారా అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించిన యాప్ను ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హిందీ, గుజరాతీ, ఉర్దూ, పంజాబీ, తమిళ్, తెలుగు, బెంగాలీ, మరాఠీ భాషల్లో సేవలు అందుతాయి.
బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు ఎనిమిది భారతీయ భాషల్లో ఉచితంగా మెయిల్ ఐడీలను అందించనున్నది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బాండ్ యూజర్లు డాటామెయిల్ సర్వీస్ ద్వారా తమ సొంత భాషల్లో మెయిల్ ఓపెన్ చేసుకోవచ్చు.
ప్రాంతీయ భాషల్లో మెయిల్ అడ్రస్లు ఇవ్వడం డిజిటల్ ఇండియాలో భాగంగా వేసిన గొప్ప ముందడుగుగా బీఎస్ఎన్ఎల్ ఎండీ అనుపమ్ శ్రీవాత్సవ్ అభివర్ణించారు. భారతదేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు తమ సొంత భాషల్లో ఈమెయిల్ సందేశాలను పంపుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ సేవలు మొబైల్ అప్లికేషన్ ద్వారా అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించిన యాప్ను ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హిందీ, గుజరాతీ, ఉర్దూ, పంజాబీ, తమిళ్, తెలుగు, బెంగాలీ, మరాఠీ భాషల్లో సేవలు అందుతాయి.