చైనా మొబైల్ కంపెనీలకు దీటుగా సరికొత్త ఫీచర్లతో, బడ్జెట్ ధరలో ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఆసుస్ భారత విపణిలోకి మరో స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. తైవాన్కు చెందిన ఆసుస్ విడుదల చేసిన తాజా మొబైల్ ఆసుస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 ఫోన్ను భారత విపణిలోకి విడుదల చేయగా, ప్రముఖ ఇ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ ద్వారా మే 3వ తేదీ నుంచి విక్రయాలు ప్రారంభంకానున్నాయి. 6 అంగుళాల(18:9) ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో పాటు, స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్తో ఇది రానుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ దీని ప్రత్యేకత.
రెండు వేరియంట్లతో ఈ ఫోన్ లభ్యం కానుంది. 3జీబీ ర్యామ్/ 32జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఫోన్ ధర రూ.10,999కాగా, 4జీ ర్యామ్/ 64జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఫోన్ ధర రూ.12,999. బ్లాక్, గ్రే రంగుల్లో లభించే ఈ ఫోన్లకు ఇ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. రూ.49తో ఏడాది పాటు మొబైల్ ప్రొటెక్షన్ను అందిస్తోంది.
ఆసుస్ మ్యాక్స్ ప్రో ఎం1ను కొనుగోలు చేసే వారికి వొడాఫోన్ ప్రత్యేక ఆఫర్ను అందించనుంది. రూ.199 రీఛార్జ్తో నెలకు 10జీబీ డేటాను 12నెలలపాటు అందించనుంది. ప్రతీ వారం వొడాఫోన్ ప్రకటించే ఆఫర్లూ ఆసుస్ ఫోన్ వినియోగదారులకు అందుతాయి. అంతేకాదు ఆండ్రాయిడ్ పి, క్యూ అప్డేట్లను కచ్చితంగా అందిస్తామని ఆసుస్ వెల్లడించింది.
ఆసుస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 ప్రత్యేకతలు
రెండు వేరియంట్లతో ఈ ఫోన్ లభ్యం కానుంది. 3జీబీ ర్యామ్/ 32జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఫోన్ ధర రూ.10,999కాగా, 4జీ ర్యామ్/ 64జీబీ అంతర్గత మెమొరీ కలిగిన ఫోన్ ధర రూ.12,999. బ్లాక్, గ్రే రంగుల్లో లభించే ఈ ఫోన్లకు ఇ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. రూ.49తో ఏడాది పాటు మొబైల్ ప్రొటెక్షన్ను అందిస్తోంది.
ఆసుస్ మ్యాక్స్ ప్రో ఎం1ను కొనుగోలు చేసే వారికి వొడాఫోన్ ప్రత్యేక ఆఫర్ను అందించనుంది. రూ.199 రీఛార్జ్తో నెలకు 10జీబీ డేటాను 12నెలలపాటు అందించనుంది. ప్రతీ వారం వొడాఫోన్ ప్రకటించే ఆఫర్లూ ఆసుస్ ఫోన్ వినియోగదారులకు అందుతాయి. అంతేకాదు ఆండ్రాయిడ్ పి, క్యూ అప్డేట్లను కచ్చితంగా అందిస్తామని ఆసుస్ వెల్లడించింది.
ఆసుస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 ప్రత్యేకతలు
- 5.99 అంగుళాల(18:9) ఫుడ్హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే
- 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ మెమొరీ.. 4జీ ర్యామ్ 64జీబీ ఇంటర్నల్ మెమొరీ, 2టీబీ వరకూ మెమొరీ పెంచుకునే సామర్థ్యం
- స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్
- 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా
- 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఫ్లాష్
- 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 10వోల్ట్ ఛార్జర్
- 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 4.2, మైక్రో యూఎస్బీ, 3.5ఎంఎం హెడ్ఫోన్ జాక్
ఇవేకాకుండా 6జీబీ ర్యామ్ 64జీబీ ఇంటర్నల్ మెమొరీతో కూడా మరో వేరియంట్ను కూడా విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీనికి వెనుక 16మెగాపిక్సెల్+5మెగాపిక్సెల్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం ముందువైపు కూడా 16మెగాపిక్సెల్ కెమెరాను అమర్చినట్లు వెల్లడించింది. దీని ధర రూ.14,999గా నిర్ణయించింది. అయితే ఇది భారత మార్కెట్లోకి కొంచెం ఆలస్యంగా రానుంది.