ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు అందిస్తోన్న 4జీ ఇంటర్నెట్ సేవలకు గట్టి పోటీనిచ్చేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకొస్తోంది.
4జీ కంటే వేగంగా పనిచేసేలా దేశవ్యాప్తంగా 40,000 వైఫై హాట్స్పాట్లను నెలకొల్పనున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్, రిలయన్స్ సంస్థలు ఇప్పటికే 4జీ సేవలు ప్రారంభించాయి. బీఎస్ఎన్ఎల్ వద్ద 4జీ స్పెక్ట్రమ్ లేకపోవడంతో ఈ సేవలు అందించలేకపోతున్నట్లు సంస్థ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రైవేటు ఆపరేటర్లతో పోటీపడేందుకు 4జీ కంటే వేగంగా ఇంటర్నెట్ను అందించేలా దేశవ్యాప్తంగా 40,000ల వైఫై హాట్స్పాట్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
4జీ కంటే వేగంగా పనిచేసేలా దేశవ్యాప్తంగా 40,000 వైఫై హాట్స్పాట్లను నెలకొల్పనున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్, రిలయన్స్ సంస్థలు ఇప్పటికే 4జీ సేవలు ప్రారంభించాయి. బీఎస్ఎన్ఎల్ వద్ద 4జీ స్పెక్ట్రమ్ లేకపోవడంతో ఈ సేవలు అందించలేకపోతున్నట్లు సంస్థ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రైవేటు ఆపరేటర్లతో పోటీపడేందుకు 4జీ కంటే వేగంగా ఇంటర్నెట్ను అందించేలా దేశవ్యాప్తంగా 40,000ల వైఫై హాట్స్పాట్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.