స్మార్ట్ఫోన్లో వచ్చే ఈమెయిల్ అలర్ట్స్ అధిక ఒత్తిడికి గురిచేస్తాయని తాజా పరిశోధనలో తేలింది. 1970లో ఒకరికొకరు తొందరగా సమాచారం చేరవేసేకొనేందుకు ఈమెయిల్స్ని సృష్టించారు. దీన్ని మొదటగా బిజినెస్, ఆ తర్వాత పర్సనల్ అవసరాల కోసం వాడడం మొదలుపెట్టారు.
ఇంత పాపులర్ అయిన టూల్.. మనుషులను అధిక నిరాశకు గురిచేస్తోందట. దాంతో పనిమీద కూడా శ్రద్ధ పెట్టకుండా ఉంటారని తేలింది. ఏదో మెయిల్ కోసం ఎదురుచూస్తుంటే.. ఇంకో మెయిల్ రావడం, ఒకేసారి కుప్పలు తెప్పలుగా మెయిల్ అలర్ట్స్ మోగడం వల్ల.. దాన్ని ఓపెన్ చేసి చూసేదాక ఊరుకోరు. అటు పనిమీద శ్రద్ధ పెట్టలేక, అటు మెయిల్ ఓపెన్ చేయలేక సతమతమవుతుంటారని ఈ పరిశోధనలో తేలింది. అందుకే పనిచేసే సమయంలో కచ్చితంగా మెయిల్స్ని స్విచ్ఛాఫ్లో ఉంచమంటున్నారు పరిశోధకులు. అనవసరమైన టెన్షన్లు పడేకంటే అదే మంచి ఉపాయమంటున్నారు.
ఇంత పాపులర్ అయిన టూల్.. మనుషులను అధిక నిరాశకు గురిచేస్తోందట. దాంతో పనిమీద కూడా శ్రద్ధ పెట్టకుండా ఉంటారని తేలింది. ఏదో మెయిల్ కోసం ఎదురుచూస్తుంటే.. ఇంకో మెయిల్ రావడం, ఒకేసారి కుప్పలు తెప్పలుగా మెయిల్ అలర్ట్స్ మోగడం వల్ల.. దాన్ని ఓపెన్ చేసి చూసేదాక ఊరుకోరు. అటు పనిమీద శ్రద్ధ పెట్టలేక, అటు మెయిల్ ఓపెన్ చేయలేక సతమతమవుతుంటారని ఈ పరిశోధనలో తేలింది. అందుకే పనిచేసే సమయంలో కచ్చితంగా మెయిల్స్ని స్విచ్ఛాఫ్లో ఉంచమంటున్నారు పరిశోధకులు. అనవసరమైన టెన్షన్లు పడేకంటే అదే మంచి ఉపాయమంటున్నారు.