ఇకపై ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ 10 మొబైల్ స్మార్ట్ఫోన్లను వాడుతున్న వినియోగదారులు స్కైప్లో 'గ్రూప్ వీడియో కాలింగ్' చేసుకునే సదుపాయాన్ని అందించనున్నారు. ఇంతకు ముందు కేవలం బిజినెస్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉండగా ఇప్పుడది సాధారణ వినియోగదారులకు కూడా లభిస్తోంది.
ప్రస్తుతం ఈ గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ను ఉపయోగించుకోవాలంటే యూజర్లు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అతి త్వరలోనే ఈ సదుపాయాన్ని ఉచితంగా అందజేయనున్నట్టు స్కైప్ ప్రతినిధులు తెలిపారు. ఈ కాలింగ్ సౌకర్యం ద్వారా యూజర్లు 25 మందితో ఒకేసారి గ్రూప్ వీడియో కాలింగ్ చేయవచ్చు.
గూగుల్ హ్యాంగవుట్స్లో ఇదే ఫీచర్ ద్వారా 10 మంది వరకు గ్రూప్ వీడియో కాలింగ్ చేసుకునే సదుపాయం ఉండగా స్కైప్ దీన్ని 25కు పెంచి అందిస్తోంది. స్కైప్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు దాదాపు 2 లక్షల కోట్ల నిమిషాల ఉచిత వీడియో కాల్స్ చేసుకున్నారని స్కైప్ బృందం తెలిపింది.
ప్రస్తుతం ఈ గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్ను ఉపయోగించుకోవాలంటే యూజర్లు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అతి త్వరలోనే ఈ సదుపాయాన్ని ఉచితంగా అందజేయనున్నట్టు స్కైప్ ప్రతినిధులు తెలిపారు. ఈ కాలింగ్ సౌకర్యం ద్వారా యూజర్లు 25 మందితో ఒకేసారి గ్రూప్ వీడియో కాలింగ్ చేయవచ్చు.
గూగుల్ హ్యాంగవుట్స్లో ఇదే ఫీచర్ ద్వారా 10 మంది వరకు గ్రూప్ వీడియో కాలింగ్ చేసుకునే సదుపాయం ఉండగా స్కైప్ దీన్ని 25కు పెంచి అందిస్తోంది. స్కైప్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు దాదాపు 2 లక్షల కోట్ల నిమిషాల ఉచిత వీడియో కాల్స్ చేసుకున్నారని స్కైప్ బృందం తెలిపింది.