కొత్త మార్గాల్లో బస్సులను దిల్సుఖ్ నగర్ నుంచి కోకాపేట్ సెజ్ వరకూ సర్వీసులను నడిపిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
156K రూటులో ప్రయాణికుల సౌకర్యార్ధం దిల్సుఖ్నగర్ నుంచి కోకాపేట సెజ్ వరకూ 4 నూతన మెట్రో బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.
దిల్సుఖ్నగర్ నుంచి కోఠి, నాంపల్లి, మెహదీపట్నం, లంగర్ హౌస్, బండ్లగూడ, తారామతిపేట, నార్సింగి మీదుగా కోకాపేట వరకూ ఈ సర్వీస్ నడవబోతుంది.
ప్రతి నలభై నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని, దిల్సుఖ్నగర్లో ఉదయం 6:00 గంటలకు మొదటి బస్సు, రాత్రి 8:40కి చివరి బస్సు ఉంటుందని.
కోకాపేట నుంచి మొదటి బస్సు ఉదయం 7:25 కు, చివరి బస్సు రాత్రి 10:07కు ఉంటుందని ఆర్టీసీ ఎండీ తెలిపారు.
TSRTC news today telugu, Telangana State Road Transport Corporation announced 4 new metro buses for city dwellers on new routes from Dilsukh Nagar to Kokapet SEZ.