ఆధార్‌కు మొబైల్‌ నెంబర్ అనుసంధానం ఇక సులువు

0
టెలికాం సంస్థల సేవా కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా ఓటీపీ (వన్‌ టైం పాస్‌వర్డ్‌) సాయంతో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఆధార్‌ అనుసంధానంలో భాగంగా ప్రస్తుత చందాదార్ల సిమ్‌ల పునఃపరిశీలనకు (రీవెరిఫికేషన్‌) అనుసరించే కొత్త మార్గాలపై టెలికాం కంపెనీలు సమర్పించిన బ్లూప్రింట్‌ను యూఐడీఏఐ ఆమోదం తెలిపింది.

డిసెంబరు 1 నుంచి ఈ కొత్త మార్గాలను అనుసరించేందుకు అనుమతినిచ్చినట్లు యూఐడీఏఐ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) అజయ్‌ భూషణ్‌ పాండే తెలిపారు. మొబైల్‌ నెంబరుకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియను సులభం చేయడంలో భాగంగా ఓటీపీ, యాప్‌ లేదా ఐవీఆర్‌ఎస్‌ లాంటి మార్గాలను గత నెలలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే వీటిని అమల్లోకి తెచ్చే ముందు ఒక ప్రణాళికను యూఐడీఏఐకు సమర్పించాల్సిందిగా టెలికాం కంపెనీలకు సూచించింది.

యూఐడీఏఐ అనుమతి లభించాక కొత్త మార్గాలను అమలు చేయమని తెలిపింది. భద్రత, ప్రమాణాలు, గోప్యత, ఆధార్‌ చట్టం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని టెలికాం కంపెనీల బ్లూప్రింట్‌కు అనుమతినిచ్చిట్లు పాండే తెలిపారు. మొబైల్‌ నెంబర్లన్నింటికీ ఆధార్‌ అనుసంధానాన్ని నిర్దేశిత గడువులోపే (ఫిబ్రవరి 6) పూర్తి చేసేందుకు ఈ కొత్త మార్గాలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. దీని వల్ల మొబైల్‌ నెంబర్ల దుర్వినియోగం తగ్గి మరింత భద్రతతో కూడిన వ్యవస్థ ఏర్పడేందుకు వీలుంటుందని తెలిపారు. ఈ కొత్త విధానాలతో పాటు కంపెనీల సేవా కేంద్రాల్లోనూ రీవెరిఫికేషన్‌ ప్రక్రియ సేవలు కొనసాగుతాయి.

వయోవృద్ధులు, దివ్యాంగులకు తదితరాల కోసం సేవా కేంద్రాల్లో ఈ ప్రక్రియను కొనసాగించాల్సిందిగా కంపెనీలకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది

Post a Comment

0Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
సుదీర్ఘ అనుభవం ఉన్న సిద్దీక్ష మాట్రిమోనీ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం - 8500001007, 9490707007

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top