రిలయన్స్ జియో ముందుగా ప్రకటించినట్లే టారిఫ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి కొత్త టారిఫ్లు అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటివరకు 84 రోజుల పాటు అపరిమిత కాల్స్, సంక్షిప్త సందేశాలు (ఎస్ఎంఎస్), రోజుకు 1 జీబీ చొప్పున అధికవేగం 4జీ డేటా..
అనంతరం పరిమితవేగంతో అపరిమిత డేటా వినియోగానికి వీలు కల్పించే పథకానికి రూ.399 వసూలు చేస్తుండగా, ఈ ధరను రూ.459కి పెంచింది.
ఇదేవిధంగా రోజుకు 2జీబీ 4జీ డేటా అందించే రూ.509 పథకం కాలపరిమితిని 56 రోజుల నుంచి 49 రోజులకు తగ్గించింది. రూ.999 పథకం కింద ఇప్పటివరకు 90 జీబీ డేటా ఇవ్వగా, ఇకపై 60 జీబీ డేటాను 3 నెలల్లో వాడుకోవచ్చని తెలిపింది. రూ.149 పథకంపై ఇప్పటివరకు 2జీబీ డేటా మాత్రమే ఇవ్వగా, దీవాలీ ధమాకా కింద 28 రోజులకు 4జీబీ డేటా లభిస్తుంది.
కొత్తగా వారంరోజులకు రూ.52, రెండు వారాలకు రూ.98తో రీఛార్జి చేసుకునే పథకాలను ఆవిష్కరించింది. వీటికింద అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్లకు తోడు, రోజుకు 0.15 జీబీ అధికవేగంతో, అనంతరం తక్కువ వేగంతో అపరిమిత డేటా వాడుకోవచ్చు. రూ.1,999 రీఛార్జితో 6 నెలల్లో 125 జీబీ డేటా లభిస్తుంది. రూ.4,999కి గతంలో 210 రోజుల్లో 380 జీబీ డేటా ఇవ్వగా, ఇకపై ఏడాది కాలావధిలో 350 జీబీ డేటా వాడుకోవచ్చని తెలిపింది
అనంతరం పరిమితవేగంతో అపరిమిత డేటా వినియోగానికి వీలు కల్పించే పథకానికి రూ.399 వసూలు చేస్తుండగా, ఈ ధరను రూ.459కి పెంచింది.
ఇదేవిధంగా రోజుకు 2జీబీ 4జీ డేటా అందించే రూ.509 పథకం కాలపరిమితిని 56 రోజుల నుంచి 49 రోజులకు తగ్గించింది. రూ.999 పథకం కింద ఇప్పటివరకు 90 జీబీ డేటా ఇవ్వగా, ఇకపై 60 జీబీ డేటాను 3 నెలల్లో వాడుకోవచ్చని తెలిపింది. రూ.149 పథకంపై ఇప్పటివరకు 2జీబీ డేటా మాత్రమే ఇవ్వగా, దీవాలీ ధమాకా కింద 28 రోజులకు 4జీబీ డేటా లభిస్తుంది.
కొత్తగా వారంరోజులకు రూ.52, రెండు వారాలకు రూ.98తో రీఛార్జి చేసుకునే పథకాలను ఆవిష్కరించింది. వీటికింద అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్లకు తోడు, రోజుకు 0.15 జీబీ అధికవేగంతో, అనంతరం తక్కువ వేగంతో అపరిమిత డేటా వాడుకోవచ్చు. రూ.1,999 రీఛార్జితో 6 నెలల్లో 125 జీబీ డేటా లభిస్తుంది. రూ.4,999కి గతంలో 210 రోజుల్లో 380 జీబీ డేటా ఇవ్వగా, ఇకపై ఏడాది కాలావధిలో 350 జీబీ డేటా వాడుకోవచ్చని తెలిపింది