ప్రీపెయిడ్ వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ ధమాకా పథకాన్ని తీసుకొచ్చింది. అతి చౌకగా డేటాను అందించనుంది, ఇందుకోసం ‘చౌక-444’ పేరిట ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. రూ.444తో రీఛార్జ్ చేసుకుంటే 90 రోజులపాటు రోజుకు 4జీబీ చొప్పున 3జీ డేటా లభిస్తుంది. అంటే ఒక జీబీ 3జీ డేటా దాదాపు రూపాయికే లభిస్తున్నట్లు అయింది.
టెలికాం రంగంలో ఇదే అతి తక్కువ ధర కావడం విశేషం. దేశీయ టెలికాం రంగంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాల అనుగుణంగా తమ ఖాతాదార్లకు అందుబాటు ధరలకే నాణ్యమైన సేవలను అందించేందుకు కృషి చేస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ (కన్జూమర్ మొబిలిటీ) ఆర్కే మిత్తల్ అన్నారు. ప్రస్తుతం రూ.333తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 3జీబీ డేటాను సంస్థ అందిస్తోంది
టెలికాం రంగంలో ఇదే అతి తక్కువ ధర కావడం విశేషం. దేశీయ టెలికాం రంగంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాల అనుగుణంగా తమ ఖాతాదార్లకు అందుబాటు ధరలకే నాణ్యమైన సేవలను అందించేందుకు కృషి చేస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ (కన్జూమర్ మొబిలిటీ) ఆర్కే మిత్తల్ అన్నారు. ప్రస్తుతం రూ.333తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 3జీబీ డేటాను సంస్థ అందిస్తోంది